ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాళి కట్టిన భార్యను , తోడపుట్టిన అక్కను దారుణం హతమార్చాడు ఓ కసాయి. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళితే..
ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో మద్యం మత్తులో ఓ వ్యక్తి.. భార్య అప్పమ్మ తో పాటు అక్క రాజులను హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో ముద్దాటపేటలో ఒక్కసారిగా అలజడి రేగింది. భార్యను చంపుతుండగా అడ్డువచ్చిన తన తండ్రితో సొదరి కుమార్తె పద్మను కూడా అప్పన్న గాయపరిచాడు
ముద్దాపేటకు చెందిన వీసీ అప్పన్న మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించొద్దని కుటుంబ సభ్యులు వారించినా పట్టించుకోలేదు. ఈ మధ్య అప్పన్న ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్యులు అతణ్ని తాగుడు మానేయాలని సూచించారు. కానీ మళ్లీ అప్పన్న తాగి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఈ దారుణానికి ఒడిగట్టాడు.
అతని దాడిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులతో పాటు అప్పన్న.. శ్రీకాకుళం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.