telugu navyamedia
సినిమా వార్తలు

సినీనటి పెళ్ళి వేడుకలో బెంగాల్ ముఖ్యమంత్రి

NUsrat

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన ప్రముఖ బెంగాల్ సినీనటి నుస్రత్ జహాన్ వివాహ వేడుకకు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరలివచ్చారు. నుస్రత్ తన ప్రియుడైన నిఖిల్ జైన్‌ను టర్కీలో గత నెలలో వివాహమాడారు. వివాహం అనంతరం కోల్‌కతా నగరంలోని ఐటీసీ రాయల్ హోటల్ లో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ ల వెడ్డింగ్ రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఈ వివాహ విందు కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోపాటు సినిమా, రాజకీయ, వ్యాపారరంగాల ప్రముఖులు పలువురు తరలివచ్చారు. నుస్రత్ జహాన్ వివాహ విందు కార్యక్రమానికి మరో సినీనటి, ఎంపీ మిమీ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ఎంపీ అయిన సినీనటి నుస్రత్ జహాన్ వివాహ విందు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విందు కార్యక్రమంలో ఇటాలియన్, బెంగాలీ వంటకాలతోపాటు శాకాహారాన్ని వడ్డించారు. నుస్రత్ జహాన్ అత్తమామలు శాకాహారులు కావడంతో శాకాహార వంటకాలను ప్రత్యేకంగా చేయించారు. ఈ విందులో మూన్ మూన్ సేన్, స్వస్థిక్ ముఖర్జీ, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ, సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థాచటర్జీ, కోల్‌కతా మేయరు ఫిర్హాద్ హకీం తదితరులు పాల్గొన్నారు.

Related posts