దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులకు ఊరట కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పువ్వుల మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. హోల్సేల్ సప్లయర్స్ పువ్వులను నేరుగా మార్కెట్లో అమ్ముకోవచ్చు అని ఆమె ఆదేశాలు జారీ చేశారు.
పువ్వుల వ్యాపారులను పోలీసులు అడ్డుకోరన్నారు. బెంగాల్లో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. 8 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరుకున్నట్లు సీఎం మమతా తెలిపారు.
ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే డబ్బు కట్టాలా?: చంద్రబాబు