telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చిరు వ్యాపారస్తులకు ఊరట.. రేప‌టి నుంచి పువ్వుల మార్కెట్లు!

mamatha benerji

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులకు ఊరట కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేప‌టి నుంచి పువ్వుల మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. హోల్‌సేల్ స‌ప్ల‌య‌ర్స్ పువ్వుల‌ను నేరుగా మార్కెట్లో అమ్ముకోవ‌చ్చు అని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

పువ్వుల వ్యాపారుల‌ను పోలీసులు అడ్డుకోర‌న్నారు. బెంగాల్‌లో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్న‌ది. 8 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరుకున్నట్లు సీఎం మ‌మ‌తా తెలిపారు.

Related posts