telugu navyamedia
సినిమా వార్తలు

వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో మహేష్

Mahesh

వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన చిత్రం “మ‌హ‌ర్షి”. మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రంపై ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ చిత్రం మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సామాజిక నేప‌థ్యంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డంతో కొద్ది రోజుల పాటు మ‌హేష్‌, వంశీపైడిప‌ల్లి కుటుంబాలు విహార యాత్ర‌ల‌కి వెళ్ళారు. అక్క‌డ అంద‌మైన ప్రదేశాలు వీక్షించారు. ఈ రోజు వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్‌డే కావడంతో గ‌త రాత్రి ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించారు మ‌హేష్‌. కేక్ పెడుతున్న ఫోటోని త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన మ‌హేష్ .. “గ‌త రాత్రి స‌ర‌దా క్ష‌ణాలు గ‌డిపాం. హ్యాపీ బ‌ర్త్‌డే వంశీపైడిప‌ల్లి.. రానున్న రోజులు నీకు అంతా మంచే జ‌ర‌గాలి” అని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ “సరిలేరు నీకెవ్వ‌రు” అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ త‌ర్వాత వంశీతో మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts