telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో “సడఖ్” సీక్వెల్

Sadak

సినిమాల ప్రదర్శన విషయంలో ఓటీటీ కూడా సవాల్ విసురుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లేయర్స్ భారీ రేటుని ఆఫర్ చేస్తూ.. పలు సినిమాల ప్రదర్శన హక్కులను చేజిక్కించుకుంటున్నాయి. ఇప్పటికే ఓటీటీలో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో చిత్రం విడుదల కాగా, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్‌, విద్యా బాలన్ శకుంత దేవి బయోపిక్‌, సుశాంత్ సింగ్ నటించిన దిల్ బెచారా చిత్రాలు ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇక ముకేశ్ భట్ నిర్మాణంలో రూపొందిన సడఖ్ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ 27 ఏళ్ల తర్వాత రూపొందుతుంది ఈ సీక్వెల్‌లో సంజయ్ దత్, పూజా భట్‌లతో పాటు అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ కనిపించనున్నారు. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో విడుదల చేయనున్నట్టు నిర్మాత ముకేష్ భట్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలు కుదేలైయ్యాయి. సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎప్పటికీ తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి. దీంతో నిర్మాతలు థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్ ఫాం వైపు దృష్టి పెట్టారు. 

Related posts