మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “గద్దలకొండ గణేష్”. ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ కీలకపాత్రలో నటించగా… పూజాహెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. 14 రీల్స్ ప్లస్ బేనర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన “గద్దలకొండ గణేష్” చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్హిట్ కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. మొదటి నుంచి వాల్మీకి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు కొన్ని గంటల ముందు “గద్దలకొండ గణేష్”గా టైటిల్ మార్చుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సినిమాపై ఎలాంటి ప్రభావం పడలేదు సరికదా… గద్దలకొండ గణేష్ గా వరుణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రోజుల్లోనే బయ్యర్లకి 75 శాతం రికవరీ రాబట్టి బ్లాక్ బస్టర్గా దూసుకెళ్తున్న “గద్దలకొండ గణేష్” చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. “‘గద్దలకొండ గణేష్” చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని, వరుణ్ తేజ్ గణేష్గా అద్భుతంగా నటించాడని, హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే మంచి సక్సెస్ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్కి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్, గోపి ధన్యవాదాలు తెలిపారు.
Thanks a ton Super Star @urstrulyMahesh what a sweet gesture … you made our day can’t express my happiness here In limited words🙏🙏 https://t.co/JzRJ2j04Mw
— Harish Shankar .S (@harish2you) September 24, 2019