telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై నమ్మకం పెరిగింది… నిర్భయ దోషుల ఉరిపై మహేష్ స్పందన

Mahesh

నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్ర‌వారం ఉరి తీశారు. ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా దీనిపై స్టార్ హీరో మహేశ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం వెయిట్ చేశాం. న్యాయం జ‌రిగింది. నిర్భ‌య ఘ‌ట‌న‌పై ఇప్పుడు జ‌రిగిన విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. మొక్క‌వోని న‌మ్మ‌కంతో పోరాటం చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు సెల్యూట్‌. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం పెరిగింది. ఇలాంటి దురాగ‌తాల‌కు స‌త్వ‌ర న్యాయం ద‌క్కాలి, బ‌ల‌మైన చ‌ట్టాలుండాలి’’ అని తెలిపారాయన. ఇంకా ఈ ఘ‌ట‌న‌పై సినీ తార‌లు మ‌హేశ్‌, ర‌వితేజ‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, త‌మ‌న్నా, రితేష్ దేశ్‌ముఖ్‌, ర‌వీనాటాండ‌న్‌, ప్రీతి జింటా త‌దిత‌రులు కూడా స్పందించారు.

Related posts