telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ కథ నేరేట్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నా.. : మహేష్ బాబు

Mahesh

నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్‌స్టా వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు మహేష్ బాబు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? దానికోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని అడగగా మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్తానని, తనకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరని, ఆయన కథ నేరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని చెప్పారు. దీంతో పూరి- మహేష్ కాంబోకి త్వరలోనే ముహూర్తం పెట్టడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇకపోతే ఈ ఏడాది ఆరంభం లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన మహేష్ బాబు.. ఇప్పుడు ‘సర్కార్ వారి పాట’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మరి మహేష్ తో పూరీ సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Related posts