telugu navyamedia
సినిమా వార్తలు

విజయ నిర్మల భౌతికకాయానికి మహేష్ నివాళి

Mahesh-Babu

టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ రోజు స్వ‌గృహంలోనే విజ‌య నిర్మ‌ల భౌతిక కాయాన్ని ఉంచ‌నున్నారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు విజ‌య నిర్మ‌ల భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ, నరేష్ కన్నీరుమున్నీరుగా విలపించారు. మ‌హేష్‌, న‌మ్ర‌త‌, జ‌య‌సుధ‌, బాల సుబ్ర‌హ్మాణ్యం, మ‌ర‌ళీ మోహ‌న్, రాఘవేంద్ర రావుతో పాటు పలువురు విజ‌య నిర్మ‌ల పార్ధివ దేహంపై పూల‌మాల‌లు ఉంచి నివాళులు అర్పించారు. విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఫిలిం చాంబ‌ర్‌లో కొద్ది సేపు ఉంచ‌నున్నారు. ఆ త‌ర్వాత చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారం జరుగుతుంది. శుక్రవారం మ‌హా ప్ర‌స్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.

Related posts