telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ బాబు-త్రివిక్రమ్ అధికారిక ప్రకటన వచ్చేసింది…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మళ్లీ వీరిద్దరి సినిమా ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. ఎన్నో అనూహ్య పరిణామాల తరువాత ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈమేరకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా తెలిపింది. సూర్యదేవర రాధాకృష్ణ దీనిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సంస్థలో మహేష్ బాబు నటించడం ఇదే తొలిసారి. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా మూవీ జనం ముందుకు వస్తుందని దర్శక నిర్మాతలు స్పెషల్ వీడియో ద్వారా తెలియచేశారు. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు ఎంత హిలేరియస్ కామెడీని పంచాయో అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

Related posts