చూడగానే విలన్ పాత్రలో చక్కగా ఇమిడిపోతాడు అనిపించే విధంగా ఉండే నటులలో మహేష్ ఆనంద్ ఒకడు. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయి. చనిపోవటం ఒక ఎత్తయితే, బాడీ కుళ్లిపోయినా ఎవరు పట్టించుకోకపోవటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్ అనుమానస్థితిలో మృతిచెందారు. తన నివాసంలో శనివారం శవమై కనిపించాడు. విలన్ పాత్రలతో పాపులరైన మహేష్ ఆనంద్ పలు సినిమాల్లో తన నటినతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుమ్రా, బేతాజ్ బాద్షా, విజేత, కురుక్షేత్ర మజ్బూర్, స్వర్గ్, తానేదార్, విశ్వాత్మ,షెహన్షా లాంటి చిత్రాలతో అలరించారు. మహేష్ ఆనంద్ శవాన్ని కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించినట్లుగా ముంబై మీడియా పేర్కొంది. మహేష్కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది. అతని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.1994లో కృష్ణ హీరోగా వచ్చిన నెంబర్ వన్’లో మహష్ ఆనంద్ విలన్గా నటించారు. ఈ సినిమాలో బ్రహ్మానందంతో పేపర్ను చింపించే కామేడి సీన్ ప్రేక్షకులను నవ్విస్తుంది.