telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ కార్మికుల కోసం 25లక్షలు విరాళం ప్రకటించిన మహేష్

Mahesh-Babu

తాజాగా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల కోసం రూ. 25లక్షలు విరాళం ప్రకటించాడు మహేష్. లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటుందన్నారు మహేష్. అందుకే… వాళ్ల కోసం రూ.25లక్షలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితులుల్లో సినీ ఇండస్ట్రీకి చెందినవారంతా సీనీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మహేష్ రూ. కోటి సాయం అందించారు. ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షల చొప్పున ఆయన విరాళం ప్రకటించారు. కోవిడ్ 19పై కలిసికట్టుగా పోరాడదామని మహేష్ పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిద్దామన్నారు. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts