“ఆర్ఎక్స్ 100” సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి “మహాసముద్రం” పేరుతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను చాలా మంది హీరోలకు వినిపించాడు. చివరికి యంగ్ హీరో శర్వానంద్ ఈ కథను ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో “మహాసముద్రం” సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గమ్యం’ చిత్రాల తర్వాత శర్వానంద్ చిరకాలం గుర్తుండిపోయే ఉద్వేగభరితమైన, బలమైన పాత్రను చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్ను చేయబోతున్నందుకు శర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు. ఇంటెన్స్ లవ్-యాక్షన్ డ్రామాగా తయారయ్యే ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఒక అప్డేట్ రానుంది.
previous post