సూపర్స్టార్ మహేష్ హీరోగా, సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందుతోన్న భారీ చిత్రం “మహర్షి”. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్వైడ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగి సినిమాపై అందరిలో భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించారు చిత్రబృందం. వచ్చేనెల 1న హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లోని “పీపుల్స్ ప్లాజా”లో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నారు.
previous post
జయలలిత బయోపిక్ కు బ్రేక్ వేస్తానంటున్న దీప