మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పలువురి మద్దతు లభిస్తోంది. కాగా ఇప్పటికే ఆమె కార్యాలయాన్ని కూల్చివేయగా… మరోవైపు మహారాష్ట్ర హోంమంత్రి కంగనా డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో ఆమె మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ ఇంటర్వ్యూలో అధ్యయన్ సుమన్… కంగనా డ్రగ్స్ తీసుకుంటుందని ఆరోపించారు. కంగనాకు డ్రగ్స్ వాడే అలవాటు ఉందని, తనకు కూడా డ్రగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నించిందని అధ్యయన్ తెలిపారు. ఆయన చేసిన ఆరోపణల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది. ఇప్పుడు ఆమెను డ్రగ్స్ అంశంలో విచారించేందుకు ముంబై పోలీసులకు విచారణ బాధ్యతను అప్పగించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు అందినట్లు సమాచారం. దీనికి సంబంధించి విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి ఆమెపై ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కంగనా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్పై కంగనా విరుచుకుపడుతున్న సమయంలో ఈ నోటీసులకు ప్రాధాన్యం సంతరించుకుంది.
previous post