మహానటి సావిత్రి జీవితకథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం “మహానటి”. సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటించారు. దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ సహా పలు దక్షిణాది స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. “ఇంటర్నేషనల్ పనోరమ” విభాగంలో ఏకైక భారతీయ చిత్రంగా 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (SIFF)కు “మహానటి” ఎంపికైంది. ఈ వేడుకల్లో భాగంగా మెయిన్ లాండ్ చైనాలో ఈ సినిమా ప్రీమియర్ను ప్రదర్శించనున్నారు. 2018లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా “మహానటి” నిలిచిన సంగతి తెలిసిందే. 2018 మే 9న విడుదలైన ఈ చిత్రం 50 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఈ బయోపిక్ కు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది.
previous post