ఓ సంధ్యా సమయం
అలసిన కన్నులతో
సొమ్మసిల్లిన ఆలోచనల తో
నెమరు వేసుకున్న
జ్ఞాపకాల ఎడబాటులో
తొంగి చూస్తే
మధుర స్మృతుల నావ
నడుస్తూనే ఉంది
కాల గమనం వెంట
పడుతూ – లేస్తూ
పరుగిడె క్రమం లో
మనసుకు తగిలిన గాయాలెన్నో
కొన్ని తీపి గుర్తులుగా
కొన్ని చేదు జ్ఞాపకాలు గా
నేటికీ మిగిలే ఉన్నాయి
-పాపారావు,
ముత్తనపల్లి