బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ కు మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్ వివాదాస్పదమైంది.
1960ల నాటి ‘కోహినూర్’ సినిమాలోని ‘మధుబన్’ పాటకు మార్పులు చేసి కొత్త ‘మధుబన్’ గీతాన్ని కంపోజ్ చేశారు. సన్నీ నటించిన ఈ ఆల్బమ్ సాంగ్ “మధుబన్ మే రాధికా నాచే” డిసెంబర్ 22న విడుదలైంది. ఇందులో సన్నీ హాట్ హాట్గా పెర్ఫార్మెన్స్ చేసింది.
అయితే ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలుతో పాటు ఉత్తరప్రదేశ్ మథురకు చెందిన పలువురు పురోహితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పి మ్యూజిక్ వీడియోను తొలగించాలని ..తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
“ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం .. ఆమెను నర్తకిగా, అరకొర బట్టలు వేసుకొని చూపిస్తే మేము బాధపడతాం. అందుకే ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు .
దీంతో స్పందించిన సంగీత సంస్థ సరిగమ.. ‘లిరిక్స్ మారుస్తామని హామీ ఇచ్చింది. దేశ ప్రజల మనోభావాలకు తాము గౌరవమిస్తామని, లిరిక్స్తో పాటు పాట పేరు మారుస్తాం. అలానే కొత్త పాటను మూడు రోజుల్లో అప్డేట్ చేస్తాం’ అని స్పష్టం చేసింది.