telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్

madhavi-latha comments

తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇదే ఇష్యూపై మరో అడుగు ముందుకు వేస్తూ.. బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ సినీ నటి మాధవీలత కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈమె ఏకంగా సచివాలయం కూల్చివేతకు కేసీఆర్ ఆరోగ్యంతో ముడిపెడుతూ తన ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉస్మానియా ఆసుపత్రిలో వర్షం నీరు రావడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అక్కడ రోగులు పడుతున్న కష్టాన్ని కళ్లకు కట్టాయి. ఈ వీడియోలు చూసిన చాలా మంది.. కేసీఆర్ గారూ!! ఈ దుస్థితి చూసిన తరువాత అయినా మనకు కావాల్సింది సచివాలయమా? లేక వైద్యాలయమా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పాలకులేమో వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి రాజుల వలె వాళ్ళ చరిత్ర చెక్కుకునే నిర్మాణాలపైనా దృష్టిసారిస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇదే వీడియోలను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసిన మాధవీలత “సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల.. ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. అందుకే కొత్త బిల్డింగ్ ప్లాన్. మరి పేషెంట్స్ ఉండే హాస్పటల్స్ ఇలా ఉండొచ్చా??? ఈ వాస్తులో నీటి దోషం ఉంది అయినా పర్లేదా? అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇక తనకు ఎప్పటిలాగే ఏ పోస్ట్ పెట్టినా ఎలాగూ నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ముందే భావించిన ఈమె.. ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ల ఫ్యామిలీ ఇదే ప్లేస్‌లో ఉంటే.. అప్పుడు కడుపు, మూతి అన్నీ కాలతాయి. దూరంగా ఉండి కారు కూతలు కూస్తే కాదు’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని ముందే హెచ్చరించింది మాధవీలత. రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనున్న క్రమంలో చేపట్టిన పాత భవనాల కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టుగా.. హైకోర్ట్‌లో స్టేల వరకూ వెళ్లింది. నిజాం రహస్య నిధుల కోసమే సచివాలయం కూల్చివేత అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిజాం పాలకులు అప్పట్లో తమ నిధులను 5 రహస్య స్థావరాల్లో దాచారని వాటిలో మింట్ కాంపౌండ్, హోంసైన్స్ కాలేజీ, సెక్రటరేట్ జీ బ్లాక్ ఉన్నాయని.. జీబ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు రాశాయంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్.

Related posts