మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు రాహుల్ వెంకట్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య దర్శకత్వంలో ఇందిరా బసవ నిర్మించిన చిత్రం ‘మధ’. 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మధ’. మార్చి 13న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు.‘నేను ఈ ప్రపంచాన్ని చదివింది.. చూసింది ఈ కిటికీలో నుండే’ అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. త్రిష్నా ప్రధాన పాత్రలో నటించింది.టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ : ‘‘మధ’ చిత్రం టీజర్ను విడుదల చేసి మా యూనిట్ను ఎంకరేజ్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కి అభినందనలు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రం. ఈ సినిమా చేయడానికి మూడేళ్ల జర్నీ చేశాం. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తున్నాం. మార్చి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కంటెంట్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
previous post
next post