సబ్సిడీ వంట గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 62.50 తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం రూ.690గా ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 627.50కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి కారణంగా సహజవాయు ధరలు తగ్గడంతో ధర తగ్గినట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ పెరిగిన నేపథ్యంలో ధరలను తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఓఎంసీలు వెల్లడించాయి. కాగా, గత మూడు నెలల నుంచి వంట గ్యాస్ ధర తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. జూన్ లో రూ. 793గా ఉన్న ధర, జూలైలో రూ. 690కి తగ్గింది. ఇప్పుడు మరింతగా తగ్గడంతో వీయోగదారులకు కాస్త ఊరట లభించింది.