telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రేమ జంట ఆత్మహత్య…

suicide

కలిసి బతకాలని కలలు కన్నంతలోనే విగతజీవులుగా మారి అయిన వాళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు ప్రేమికులు. సన్నిహితులకు షాక్‌ మిగులుస్తున్నారు. ప్రేమించుకుంటున్నారు.. కలిసి బతకాలని కలలుకంటున్నారు. కానీ అనేక అడ్డంకులు.. చివరికి ప్రాణాలు తీసుకోవటమే మార్గం అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గత 48గంటల్లో అనేకం జరిగాయి. కాని పెద్దలు నిరాకరించడంతో చావే దిక్కనుకుంది విశాఖ ప్రేమ జంట. విశాఖ గాజువాకలో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పరవాడ మండలం బోనంగికి చెందిన అభిలాష్, నాగినిగా గుర్తించారు. . కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నాగిని, అవినాష్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శ్రీనగర్ కాలనీలో రెండు రోజుల క్రితమే ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారు. ఈరోజు పెళ్లి చేసుకుందాం అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ ఇంతలోనే ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలు నాగిని కి ఇదివరకే పెళ్లి జరిగిందని, భర్తతో అండమాన్ లో ఉండేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. అదే గ్రామానికి చెందిన అవినాష్ తో లాక్ డౌన్ సమయంలో ప్రేమాయణం నడిపి పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. 

Related posts