తన ప్రియురాలి ఇంట్లోనేఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. కడలూరు జిల్లాలోని చిదంబరానికి చెందిన అన్భళగన్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వారిద్దరు 18 నెలల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. కరోనా విజృంభణతో విధించిన లాక్డౌన్ కారణంగా వారిద్దరు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. ఇటీవల ఆమెను ఎలాగైనా చూడాలని ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. అయితే, అతడిని గుర్తించి ప్రియురాలి కుటుంబ సభ్యులు అతడిని వెనక్కి పంపారు.
తాజాగా మరోసారి ఆమె కోసం ఇంటికి వెళ్లాడు. ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు ఇంట్లోనే ఉన్నారు. వారంతా కలిసి అతన్ని నరికి చంపారు. దీంతో అక్కడికక్కడే అన్భళగన్ ప్రాణాలు కోల్పోయాడు. తమ పరువు తీస్తున్నాడన్న కోపంతోనే తాము అతడిని చంపామని ఆ కుటుంబం ఓ లేఖను ఇంట్లో ఉంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.