ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ‘కేటీఆర్ నోట… జగన్ విధ్వంసపాలన మాట… అట్టుంటది ఒక్క చాన్స్తోని..’ అంటూ ఉన్న వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
కాగా..క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కేటీఆర్ ఏపీని ఉద్దేశించి పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
నాకో మిత్రుడు ఉన్నాడు.. ఆయన సంక్రాంతి పండుగకు పక్క రాష్ట్రానికి వెళ్లాడు.. ఆయనకు అక్కడ తోటలు, ఇల్లు ఉంది.. వెళ్లి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసాడు. కేటీఆర్ గారు మీరు ఒక పనిచేయండి… రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రానికి పంపించండి.. అని చెప్పారు..
ఎందుకని అడిగితే.. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా ఉందని చెప్పాడు.. మళ్లీ తిరిగొచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉందని.. పక్క రాష్ట్రాన్ని చూసివస్తేనే.. మనం చేస్తున్న అభివృద్ధి తెలిసి వస్తుందని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.
ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో: సుజనా చౌదరి