కొద్ది రోజుల క్రితం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. ప్రస్తుతం వైద్యారోగ్యసిబ్బందికి వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు రోజువారీ పాజిటివ్ కేసులు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఈ నెల 19న ఓం బిర్లా కరోనా వైరస్ బారిన పడ్డారు. 58 ఏళ్ల వయసున్న ఆయనని మార్చి 20 న ఎయిమ్స్ కోవిడ్ సెంటర్ లో చేర్చారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి స్థిరంగా ఉందని ఎయిమ్స్ ఢిల్లీ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతుండటం కొంత భయాన్ని కలిగిస్తుంది. కానీ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.
previous post
ప్రభుత్వం బలంగా ఉంటే..అన్నీ సవ్యంగా సాగుతాయి : మోదీ