ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో రూ. 60 కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ కు వాళ్ల నాన్న చంద్రబాబు సర్టిఫికెట్ కొనిచ్చారని ఆరోపించారు. అన్నీ కోట్లు ఖర్చు పెట్టి కొన్న సర్టిఫికెట్ ను చదవడం కూడా లోకేష్ కు రాదని ఎద్దేవా చేశారు.
ఒకటో క్లాసు పరిజ్ఞానం కూడా లేని మీ కొడుక్కి ఏకంగా మూడు శాఖలకు మంత్రిని ఎలా చేశారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు లోకేష్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇంత దుర్మార్గులకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రలోభాలను నమ్మకూడదని ప్రజలకు వివరించారు.
లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయం: మంత్రి బొత్స