సీఎం కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. బొట్టు పెట్టుకొని యాగాలు, పూజాలు చేస్తే భక్తునిగా మారలేరని కేసీఆర్ను విమర్శించారు. యాదాద్రిలో దేవుడి కంటే ముందు కేసీఆర్ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష్మీ నరసింహ స్వామిని ఉల్లితో చెక్కడం దారుణమన్నారు. శిల్పులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు శిల్పాలు చెక్కుతున్నట్లు అధికారులే స్పష్టం చేశారని లక్ష్మణ్ తెలిపారు.ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.