కరోనా మహమ్మారి బారిన పడిన గాన గాంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆగస్టు 5న బాలు ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. అయితే బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై తాజా బులిటెన్ విడుదల చేసింది ఎంజీఎం ఆస్పత్రి. చాలా రోజుల నుండి ఈ వైరస్ తో పోరాడుతున్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఎక్మో సపోర్ట్ తో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ కరోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా చేశారు డాక్టర్లు. ఇక ఎస్పీబి కోలుకోవాలని ప్రముఖ నటులు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు.
previous post
“దర్బార్”కు నష్టాలు అన్నది ఓ డ్రామా మాత్రమే… : భారతీరాజా