ఒక్క పాటతో సూపర్ సెలిబ్రెటీ స్థాయినందుకున్న రనుమండల్ దశ తిరిగిపోయింది. కోల్కత్తా రైల్వే స్టేషన్ వద్ద “ఏక్ ప్యార్ క నగ్మా హై” అని రను పాడిన పాటను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా తాను కంపోజ్ చేస్తున్న “తేరీ మేరీ కహాని” సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చాడు. ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే లెజెండరీ గాయని లతా మంగేష్కర్ పాడిన “ఏక్ ప్యార్ నగ్మా హై” అనే పాట పాడిన రనుమండల్ ఓవర్ నైట్ సెలబ్రిటీ కావడంతో పాటు అనేక అవకాశాలు దక్కించుకుంటుండగా, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ మాత్రం ఆమెని తప్పు పడుతోంది. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ మాట్లాడుతూ “నా పేరు వాడుకొని బాగుపడితే అది అదృష్టంగా భావిస్తాను. అంతేకాని అనుకరించి పేరు తెచ్చుకుంటే అది ప్రతిభ అనిపించుకోదు. రణు మొండల్ నేను పాడిన పాటని అనుకరించి చాలా పాపులర్ అయింది. ఈ విజయం కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే పరిమితం. ఈ కాలం నాటి యువ సింగర్స్ నా పాటలు చాలా బాగా పాడి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలా పాడిన వారిలో సునిధి ఛౌహన్, శ్రేయా ఘోషల్ ముఖ్యులు. ఒరిజినాలిటీ నమ్ముకొని పాటలు పాడండి. అంతే తప్ప అనుకరించి పాపులారిటీ తెచ్చుకున్న అది ఎంతో కాలం నిలవదు. నా సోదరి ఆశా భోంస్లే సొంత పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా చేసి ఉండకపోతే ఎప్పుడు నా నీడలోనే ఉండిపోయేంది. సొంత ప్రతిభ ఎంత పెద్ద విజయం సాధించి పెడుతుందో చెప్పడానికి ఆశా కెరీరే నిదర్శనం” అని లతామంగేష్కర్ అన్నారు. గతంలో లతా తాము పాడిన ఆణిముత్యాలని రీమేక్తో నాశనం చేస్తున్నారని కూడా మండిపడిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్ పులివెందుల పులిబిడ్డ: సినీనటి రమ్యశ్రీ