telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా బాధితులకు అండగా నిలిచిన లతామంగేష్కర్

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది.  ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, హీరోలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అటు కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్ర ను అతలాకుతలం చేస్తోంది. దానితో పాటు పలు రాష్ట్రాలు సైతం కనీసం వైద్య సదుపాయాలను కొవిడ్ బాధితులకు అందించలేక ఇబ్బంది పడుతున్నాయి. వైద్య పరికరాలను, ఆక్సిజన్ ను, మందులను, వాక్సిన్ ను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతున్నాయి. వీటిని గమనించిన కొందరు సెలబ్రిటీస్ తమ వంతుగా సాయం అందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మహారాష్ర్ట సి.ఎం. రిలీఫ్ ఫండ్ కు ఇటీవల రూ. 7 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మహారాష్ట్ర సి.ఎం. ఉద్ధవ్ థాకరే సైతం లతా మంగేష్కర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Related posts