వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ అవినీతి ఆరోపణల పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చారు. ఓ తెలుగు టీవీ చానల్ ఇంటర్వ్యూలో జగన్పై రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది రాజకీయాల కోసం చేసిన ఆరోపణలేనని స్పష్టం చేశారు.
తమకు వచ్చిన ఆధారాల మేరకే చార్జిషీట్లో పొందుపర్చామని తెలిపార్రు. దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. జగన్పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు. వైఎస్ జగన్పై కేసులు నమోదు చేసి, విచారణాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.