కుమార్ విశ్వజిత్ ఏపీ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్గా ఉన్న విశ్వజిత్ను వైసీపీ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనపై పూర్తిస్థాయి దృష్టిపెడతానని పేర్కొన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించేవారి భరతం పడతామని హెచ్చరించారు.
ఎవరైనా లంచాలు అడిగితే సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వివరించారు. ప్రోటోకాల్ డైరెక్టర్గా ప్రసన్న వెంకటేశ్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్బాబు డిప్యూటేషన్ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. అశోక్ బాబును రక్షణ శాఖకు వెనక్కి పంపుతూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
బెంగాల్ టైగర్ దీదీని ఏమీచేయలేరు: చంద్రబాబు