telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 వేలంపై సంగక్కర కీలక వ్యాఖ్యలు…

శ్రీలంక క్రికెట్ అంతర్జాతీయ సిరీస్ ల షెడ్యూల్ కారణంగా శ్రీలంక ఆటగాళ్లను ఐపీఎల్ 2021 వేలంలో తీసుకోలేదని అంతేకాని ఆటగాళ్ల సామర్థ్యం కారణం కాదు అని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర అన్నారు. ఈ ఐపీఎల్ ఎడిషన్లో శ్రీలంక ఆటగాళ్ళు అంతర్జాతీయ కట్టుబాట్ల వారిని కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణమని వివరించారు. శ్రీలంకలో ప్రస్తుతం అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. అయితే ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడితే సీజన్లో ఏదో ఒక సమయంలో మధ్యలో బయలుదేరాల్సి ఉంటుంది అని… ఐపీఎల్ శ్రీలంక ఆటగాళ్ల కొరతను మీరు చూడటానికి ఇది ఒక కారణం… ఖచ్చితంగా వారికి సామర్థ్యం కాదు అని ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ సంగక్కర విలేకరుల సమావేశంలో అన్నారు. ఇక ఇదిలావుండగా, శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రస్తుత ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్ మహేలా జయవర్ధనే ఇదే విషయంలో భిన్న అభిప్రాయాలు తెలిపాడు. జయవర్ధనే ప్రకారం… ప్రస్తుత శ్రీలంక ఆటగాళ్ళు మినీ వేలంలో ఐపీఎల్ జట్ల డిమాండ్లకు సరిపోలేదు అని.. తమ ప్రతిభతో వారిని ఆకర్షించలేకపోయారని అన్నారు.

Related posts