telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చిల్లర డబ్బులు చిన్నారి విరాళం: కేటీఆర్‌ ప్రశంసలు

chinnari donation

కరోనా పోరులో భాగంగా గళ్ళ గురిగిలో దాచుకున్న చిల్లర డబ్బులను ఓ చిన్నారి విరాళంగా ఇచ్చింది. కుటుంబసభ్యులు అప్పుడప్పుడు ఇచ్చిన మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గాంధీ మిరియాల అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో తెలిపారు.

టీవీ, సోషల్ మీడియాల్లో అందరూ విరాళాలు ఇస్తుండడం చూసి నా కూతురు అద్విత కూడా తన సేవింగ్ గళ్ల గురిగి పగలకొట్టి మరీ డొనేట్ చేసింది… మీరంటే ఒక అభిమానం’ అంటూ ఒకరు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ పాప తెలంగాణ ప్రభుత్వానికి రూ.440 విరాళం ఇచ్చిన విషయానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌ థ్యాంక్స్‌ అద్విత అని ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసి ఆమె ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పాపపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts