telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య: మంత్రి కేటీఆర్

KTR TRS Telangana

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. లాక్ డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.‘నువ్వు బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Related posts