వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్కాల్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ను ఆదేశించారు. ఒడిశాకు చెందిన కూలీలు కొంతకాలం క్రితం పనికోసం ముస్తాబాద్ వచ్చారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వారంతా కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు.
రెండు రోజుల క్రితం కాలినడకన పెద్దూరు చేరుకున్నారు. స్థానిక నాయకులు కొందరు వారికి ఆశ్రయం కల్పించి రెండు రోజులుగా వారికి భోజనాలు అందిస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి వీరు సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు.
దీంతో నిన్న రాత్రి వారు మంత్రి కేటీఆర్కు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. కలెక్టర్తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఒడిశా తరలించారు. తమ ఫోన్ కాల్కు స్పందించి వాహనం ఏర్పాటు చేసిన కేసీఆర్కు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.