telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పచ్చని తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: కేటీఆర్

KTR TRS Telangana

పచ్చని తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సనత్‌నగర్‌నియోజక వర్గం పరిధిలోని బోయిగూడలోని జీహెచ్‌ఎంసి పార్కులో మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాద్యతగా భావించి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. 20లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పార్కును కూడా మంత్రి ప్రారంభించారు.

పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, చెస్‌గేమ్‌, పిల్లల క్రీడా సామగ్రిని మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఎంతో అద్భుతంగా పార్క్‌ను నిర్మించారని అధికారులను అభినందించారు. కాలనీ వాసులతో మాట్లాడి పార్క్‌ను మంచిగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts