జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాయకులు మాట్లాడుతున్న మాటలు… తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. హుస్సేన్సాగర్ కట్టపై నిర్మించిన పీవీ, ఎన్టీఆర్ సమాధుల్ని కూల్చేస్తామంటూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దారుస్సలాం కూల్చేస్తామంటూ బండి సంజయ్ ధీటుగా బదులివ్వగా… ఎంఐఎం వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంశం మీద కేటీఆర్ కూడా స్పందించారు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహా నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటు లేదు. అని ఆయన తెలిపారు. మరి ఈ విషయం పై మళ్ళీ ఎవరు స్పందిస్తారు అనేది చూడాలి.
previous post
next post
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం: హరీష్ రావు