తాజాగా, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం తెలిసిన విషయమే, దీనిపై పలువురు సెలక్షన్ బోర్డు పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే తరహాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, అంబటి రాయుడుని సెలక్టర్లు అవమానించినా, భారత క్రికెట్ అభిమానులు మాత్రం మర్చిపోరని అన్నారు. అంబటి రాయుడి సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాయుడు ప్రపంచ కప్ కోసం తనను ఎన్నుకోకపోవడం, అలాగే దానికోసం సెలక్షన్ బోర్డు చెప్పిన కారణంపై అసంతృప్తితో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.