telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు

KTR TRS Telangana

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చే కార్యక్రమం షురూ చేశారు. ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నిర్వహించే కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదు? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అందుకు కేటీఆర్ బదులిస్తూ, ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్యశ్రీ పథకం ఎంతో సమగ్రమైనదని తెలిపారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకానికి రూపకల్పన చేసిందని తెలిపారు. అయితే ఆ నెటిజన్ కరోనా కష్టకాలంలో ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించగా అందుకు కేటీఆర్ సమాధానం దాటవేశారు. 

Related posts