telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం: కృష్ణంరాజు

Krishnam Raju Says Election contest

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. సోమవారం తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ విజయం సాధిస్తారని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని చెప్పారు. గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునారావృత్తం అవుతాయని కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. కాగా పోటీ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కృష్ణంరాజు ప్రకటించారు.

Related posts