ప్రకృతి ఒడిలో ఎంతో పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉలిక్కిపడుతోంది. కరోనా కోనసీమను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోనసీమలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేశారు. అయితే, లాక్ డౌన్ ఎత్తివేయడంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.
ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు కోనసీమను వణికిస్తున్నారు.రాజోలు క్వారంటైన్ లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క రోజే 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోనసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఆ ముగ్గురికి ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం: యామిని