telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోబెల్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట

komati-venkat-reddy mp

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త కుట్రకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నాడని తమకు అనుకూలమైన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఉన్నది లేన్నట్టు.. లేనిది ఉన్నట్టు గోబెల్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట.. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ప్రజల గొంతు వినిపించాల్సిన ఛానల్స్ కొన్ని పార్టీలే నడిపించడం వల్లే ఈ అవాస్తవాలకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.” అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాగా సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్‌ ద్వారా స్పందించారు. ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అని తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.

Related posts