telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆత్మలు ఘోషిస్తున్నాయి.. కేసీఆర్ కు ఉసురు తగులుతుంది

komati-venkat-reddy mp

తెలంగాణ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. కరోనాతో ప్రజలు పిట్టల రాలుతుంటే నీ కంటికి కన్పించడం లేదా.. కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నీ కొడుకు కేటీఆర్ కు అప్పగించావడని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ ను ప్రజలు ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారని.. రాష్ట్రంలో అయ్యా…కొడుకుల డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా…నీ కుటుంబం కోసమా ? కేసీఆర్… నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని నిప్పులు చెరిగారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని..కేసీఆర్ కు ప్రజల ఉసురు తగులుతుందన్నారు. కేసీఆర్ ఇకనైనా కండ్లు తెరిచి.. కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నీకు మానవత్వం ఉందా.. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. ఎందుకు కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు కేసీఆర్ ? అని నిలదీశారు. కేసీఆర్ కు ఎన్ని రోజులు భజన చేస్తారు…ప్రజల గోస మీకు పట్టదా అని నిలదీశారు. మీ ప్రభుత్వ నిర్వహం వల్ల మెరుగైన వైద్యం చేయించుకోక ఇంకా ఎంత మంది పేద ప్రజల ప్రాణలు పోవాలి.. కరోనాతో చనిపోతున్న వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు.

Related posts