telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాతలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు… నిప్పులు చెరుగుతున్న నిర్మాతలు

Dhanush'

తమిళ స్టార్ హీరో ధనుష్ నటీనటులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, మోసం చేస్తున్నారని నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ మాట్లాడుతూ “నిర్మాతల నుంచి తమకు రావాల్సిన పారితోషికాన్ని తీసుకోవడానికి ముప్పుతిప్పలు పడాల్సి వస్తోందని అన్నాడు. నటులను కొందరు నిర్మాతలు మోసం చేస్తున్నారని, వారి నుంచి డబ్బులు వసూలు చేయడం తలకు మించిన భారంగా మారుతోంది” అంటూ ధనుష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలపై తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుష్ నిర్మాతలకు భారంగా మారాడని, ఎవరికీ కొంచెం కూడా సహకారం అందించడని అళగప్పన్ అనే నిర్మాత విమర్శించారు. విజయ్, అజిత్ లాంటి నటులు నిర్మాతల కష్టాలను అర్థం చేసుకుని సంపూర్ణ సహకారం అందిస్తారని, కానీ, ధనుష్ నుంచి మాత్రం కొద్దిగా కూడా సహకారం ఉండదని అన్నారు. ధనుష్‌తో సినిమాలు తీసిన నిర్మాతలెవరూ లాభాలు ఆర్జించలేదని, ఆయనతో సినిమాలు తీసిన చాలా మంది నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోయారని నిర్మాత రాజా ఆరోపించారు. ఇదే కోవలో మరికొందరు నిర్మాతలు కూడా ధనుష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ధనుష్ అభిమానులు సోషల్ మీడియాలో నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు.

Related posts