telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ 2019 : నేడు హైదరాబాద్ తో రాజస్థాన్, ..కోహ్లీ కొత్త రికార్డు ..

kohli ipl record of 5k runs

బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఐపీఎల్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా కోహ్లీ కన్నా ముందున్నాడు. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

ముంబయితో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఐదు వేల క్లబ్‌కు 46 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. దీనితో లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన 181 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సరిగ్గా 46 పరుగులు చేసి 5000 క్లబ్‌లో చేరాడు. వెంటనే బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్‌లో ముంబయి తన ఖాతాలో మొదటి విజయం నమోదు చేసుకుంది. బెంగళూరు రెండో ఓటమిని చవిచూసింది. 

ipl 2019నేడు హైదరాబాద్ vs రాజస్థాన్ మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరగనుంది. 

Related posts