టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వెస్టిండీస్ సిరీస్ కోసం అప్పుడే జిమ్లో కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో సారథి సన్నాహక కార్యక్రమాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిమ్లో బరువులెత్తుతున్న ఓ వీడియోను కోహ్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘కష్టానికి ప్రత్యామ్నాయమంటూ ఏదీ లేదు.’ అని రాసుకొచ్చాడు. అభిమానులు కూడా దీనిపై ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ఫుల్స్టాప్ చెప్పి తిరిగి జట్టును విజయాల బాట పట్టించేందుకు విండీస్ పర్యటనను వినియోగించాలని టీమిండియా భావిస్తోంది.
ఈ పర్యటనకు సంబంధించి భారత జట్టును ఎంపిక 21న జరగనుంది. వికెట్కీపర్ ధోనీ భవిష్యత్తేంటి? రిటైరవుతాడా లేదా కొనసాగుతాడా.. అనే ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది.
Hard work has no substitute. 🙌🏼
Music – @thescript pic.twitter.com/vuVxc9Djjm— Virat Kohli (@imVkohli)
కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా… వర్మకు ప్రముఖ నిర్మాత కౌంటర్