telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీటూ : ఆ నటుడి గురించి అప్పుడే ఎందుకు చెప్పలేదు… తనుశ్రీకి బిగ్ బాస్ బ్యూటీ ప్రశ్న

Koena

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గతేడాది ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన ఆరోపణలు మీటూ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపింది. తనుశ్రీ తర్వాత ఎందరో నటీమణులు, గాయనిలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు తమకు ఇండస్ట్రీలో ఎదురైన వేధింపుల గురించి చెప్పి ఎందరో బండారాలు బయటపెట్టారు. అయితే పదేళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి అప్పుడే ఎందుకు చెప్పలేదని తనుశ్రీపై ఆరోపణలు చేస్తున్నారు బాలీవుడ్ నటి కోయినా మిత్రా. ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొన్న కోయినా రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కోయినా తనుశ్రీపై ఆరోపణలు చేశారు. ‘తనతో నానా పటేకర్‌ తప్పుగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది. ఈ ఘటన దాదాపు పదేళ్ల క్రితం జరిగింది. అలాంటప్పుడు అప్పుడే ఎందుకు ఈ విషయం గురించి మీడియా ముందు ఎందుకు బయటపెట్టలేదు. నానా పటేకర్‌పై కేసు పెట్టి అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒక్కసారైనా వచ్చి నానా పటేకర్ పరిస్థితిపై ఆరా తీసిందా? ఈ ఘటన గురించి బయటపెట్టడం వల్ల తనుశ్రీకి బాగా పాపులారిటీ వచ్చింది. దాంతో పలు ప్రకటనల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లిపోయింది. ఇండస్ట్రీలో నాకు నచ్చే నటీమణి కంగనా రనౌత్ ఒక్కరే. ఏదైనా ముఖం మీదే నేరుగా మాట్లాడే ధైర్యం ఆమెకు ఉంది. ఫెమినిజంకు అసలైన నిర్వచనం చెప్పింది కంగన మాత్రమే’ అని వెల్లడించింది. దాంతో కోయినాపై ప్రశంసలు కురిపించింది కంగన సోదరి రంగోలీ. తన చెల్లెలిని ఎవరైనా కాస్త పొగిడితే చాలు వారు ఎలాంటివారైనా పొగిడేస్తుంది రంగోలీ. నిజానికి తనుశ్రీ ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టడం వల్ల ఎందరో నటీమణులు తమ అనుభవాలను బయటికి చెప్పకోగలిగారు. అందుకు మెచ్చుకోవాల్సిందిపోయి అప్పుడే ఎందుకు చెప్పలేదు అని కోయినా ప్రశ్నించడం కరెక్ట్ కాదు. అలా చేసినందుకు కోయినాను మందలించాల్సిందిపోయి తన చెల్లెల్ని పొగిడినందుకు తెగ మెచ్చకుంది రంగోలీ. అయితే కోయినా మిత్ర పాపులారిటీ కోసమే తనుశ్రీని టార్గెట్ చేసిందంటున్నారు నెటిజన్లు.

Related posts