telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆ రెండు పార్టీలు నోటాతో పోటీ పడుతున్నాయి…

చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో నిర్వహించిన ప్రచారంలో ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని.. టీడీపీ కుప్పకూలి పోయింది దాని గురించి చెప్పుకోవటం అనవసరం అంటూ ఎద్దేవా చేశారు.. జగన్నాథ రథచక్రాలను ఆపాలనుకుంటే చంద్రబాబు జీవితం సరిపోదన్న కొడాలి.. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. దేవినేని ఉమని ఉప ఎన్నికల్లో ఇంఛార్జ్‌గా వేసి చంద్రబాబు ఏం సాధించాలి అనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించిన ఆయన.. సొంత నియోజకవర్గంలో సర్పంచులను కూడా గెలిపించుకోలేకపోయిన వ్యక్తి దేవినేని ఉమ.. అలాంటి వ్యక్తి తిరుపతిలో టీడీపీని గెలిపిస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు.  ఇక, తిరుమలలోని తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డ మంత్రి కొడాలి.. దేవుడిసొమ్ము కోసం కక్కుర్తి పడాల్సిన పని సీఎం వైఎస్ జగన్‌కు లేదన్నారు.. దేవుడిపై అపార ప్రేమ, నమ్మకం జగన్ సొంతమన్న ఆయన.. అందుకే, ఏ మీటింగ్ లోనైనా దేవుని దయ, ప్రజల ఆశీస్సులతో పని చేద్దామని సీఎం జగన్‌ అంటారని గుర్తుచేశారు.

Related posts