telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు జన్మలో ముఖ్యమంత్రి కాలేడు: మంత్రి కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు ఎల్లో మీడియాలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

చంద్రబాబును ఉన్న పళంగా సీఎం చేసేయాలని ఎల్లో మీడియా తాపత్రయపడుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు జన్మలో ముఖ్యమంత్రి కాలేరని, ఎల్లో మీడియా ఎన్ని ఫీట్లు చేసినా వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మరని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ గారిని భ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్నారని.. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక్క ఏపీ నుంచే కాదు బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతున్నట్లు మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు.

సవాంగ్ గారు వచ్చి చాలా కాలమైందని.. వేరే వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం డీజీపీని మార్చిందని కొడాలి నాని వివరణ ఇచ్చారు. 

వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ విషయంలో ఎవరికి నచ్చిన అంశం వాళ్లు బయటకు తెస్తున్నారని.. ఆరోజు జగన్ కేసులో అప్పుడున్న జేడీ కూడా తమకు కావాల్సిన పత్రికలకు లీకులు ఇచ్చేవాడని ఆరోపించారు.

వివేకాను హత్య చేయిస్తే జగన్‌కు ఏం వస్తుందని కొడాలి నాని ప్రశ్నించారు. వాళ్లు దేవుడిని నమ్ముకున్న కుటుంబం అని.. అలాంటి కుటుంబాన్ని రోడ్డుమీదకు లాక్కొచ్చిన వాళ్లు టీడీపీ వాళ్లు అని మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదు అని.. చరిత్ర శాశ్వతం అని చంద్రబాబు గుర్తించాలన్నారు.

Related posts